31, డిసెంబర్ 2010, శుక్రవారం

నూతన సంవత్సర శుభాకాంక్షలు


పి .పద్మావతి శర్మ .ఎం . . తెలుగు పండిట్ .
రచయిత్రి ,గాయని ,ఆద్యాత్మిక ప్రవచకురాలు .

6, డిసెంబర్ 2010, సోమవారం

అగస్త్య ఆటలు

మా మనమడు (చెల్లి మనమడు )అగస్త్య జామకాయలు తినే వయస్సు లేక పోయిన వాటితో యుద్ధం చేసే వయస్సు
మాత్రం ఉంది.అందుకే వాటితో యుద్ధం చేస్తున్నాడు చూడండి.

అగస్త్య

గాన స్రవంతి

వెంకటేశ్వర స్రవంతి


`





వెంకటేశ్వర స్వామి వారికి నిత్యం పూలతో అలంకరిస్తూ ఉంటారు. పూలన్నీ టి.టి.డి. వారు పెంచే ఉద్యానవనాలనుంచి,ఇతర ప్రాంతాల నుంచి వస్తాయి. ప్రతిరోజూ ఉదయం,సాయంత్రం జరిగే తోమాల సేవలో స్వామివారికిపూలమాలలు అలంకరిస్తారు. ఋతువులను బట్టి పూలు మారతాయే కానీ అలంకరణలో మార్పు ఉండదు.స్వామివారిమూలమూర్తికి అలంకరించే స్థానాలను బట్టి పూలమాలలకు స్థిరమైన పేర్లు ఉన్నాయి. కిరీటం మీదినుంచి రెండుభుజముల పైకి అలంకరించే
ఎనిమిది మూరల పూల మాల "శిఖామణి".సాలగ్రామ మాలలనానుకొని
భుజముల నుండి పాదములవరకు వ్రేలాడే నాలుగుమూరల "సాలిగ్రామ పూలమాలలు ". మెడలో అలంకరించే రెండు వరుసలమూడున్నర మూరల పూల మాల "కంటా సరి ". శ్రీవారి వక్షస్థలంలో ఉండే శ్రీదేవీ,భుదేవిలకు ఒకటిన్నర మూరల దండలు " వక్షస్థలలక్ష్మి"పూలదండలు. ఒక్కో మూర
చొప్పున శంఖు,చక్రాలకు రెండు "శంకు ,చక్ర మాలలు". స్వామివారి బొడ్డువద్ద నుండే నందక
ఖడ్గానికి అలకరించే రెండు మూరల పూలమాల "కఠారి సరం ". మోచేతుల వద్దనుంచి
మోకాళ్ళ పైనుండి పదాల వరకుఉండే పూల దండలు "తావళములు". శ్రీవారి పాదాలకు వేసే
ఒక మూర పూల దండలు రెండు "తిరువడి దండలు ". ప్రతి గురువారం సాయంత్రం జరిగే "పూలంగి లో"లో స్వామి వారి ఆభరణములు తీసివేసి పూలనే అభరణములుగా
అలంకరిస్తారు ఇవి కాక ఆనందనిలయం లోని ఉత్సవమూర్తులకుదండలుతయారుచేస్తారు.భోగశ్రీనివాసమూర్తికిఒకదండ ,కొలువు శ్రీనివాస మూర్తికి ఒకదండ ,శ్రీదేవి,భుదేవి సహితమలయప్ప స్వామికి మూడు దండలు,శ్రీదేవి,భుదేవి సహితఉగ్ర శ్రీనివాస మూర్తికిమూడు దండలు, శ్రిసితారామ లక్ష్మణులకు మూడు దండలు.రుక్మిణి శ్రికృష్ణులకు రెండు దండలు,అనంత గరుడ విష్వక్సేనుల వారికీ మూడు దండలు, సుగ్రీవఅంగడహనుమంతులవారికి మూడు దండలుతయారుచేస్తారు.ఇవే కాక వరదరాజస్వామికి,వకుళ మాతకు, రామానుజుల స్వామి వారి మూల మూర్తికి, ఉత్సవ మూర్తికి,యోగ నరసింహ స్వామివారికి ,విష్వక్సేనులు,పోటు తయారుకు,గరుడాళ్వారు వారికీ ,చక్రత్తళ్వారు వారికీ, బేడి ఆంజనేయస్వామి వారికి ఒకొక్కదండ,బంగారు వాకిలి ద్వారపాలకులకు రెండు దండలు,వరాహ స్వామివారి ఆలయానికి మూడు దండలు ,ప్రతిఆదివారం కోనేటిగట్టు ఆంజనేయస్వామి వారికి ఒకదండ తయారు చేస్తారు. అంతా కాక నిత్య కళ్యాణం ,వసంతోత్సవం,ఊరేగింపులు ,ఉత్సవాలకు ప్రత్యెక దండలు తయారు చేస్తారు. తులసి,చామంతులు,గన్నేరులు,సన్నజాజులు,మల్లెలు,మొల్లలు,మొగలి,తామర,కలువ,
గులాబీలు,సంపెంగలు,మామిడాకులు, తమలపాకులు,కనకాంబరాలు,మరువం, మాచిపత్రం, దవనం, మారేడు దళం,పచ్చిపసుపు ఆకులూ మొదలగు రంగు రంగుల సుగంధ పరిమళ పుష్ప జాతులు,పత్రాలతోదండలు తయారు చేస్తారు.



























5, డిసెంబర్ 2010, ఆదివారం

కవితా స్రవంతి





















సీతాకోకచిలుక
























































































4, డిసెంబర్ 2010, శనివారం

కవిత స్రవంతి
























నల్లిని
నలపాలన్న,

దోమను చంపాలన్నా,
పిల్లిని తరమాలన్నా,
కుక్కను కొట్టాలన్నా,
పాపను గిచ్చాలన్నా,
పేలను కుక్కలన్నా,
ఎలుకను పట్టలన్నా,
జనాని కేమిటో ఇష్టం.
బలహినునిపై బలవంతుడు
చేసే దౌర్జన్యం.

కవితా స్రవంతి



నన్ను చూచుకుని నేనే మురిసి పోతుంటాను.

నా మేని మెరుపు చూచుకుని నే ఆనందపడుతుంటాను.
అందుకే రాత్రంతా కునుకు తీయక విహారం చేస్తుంటాను.
అందరు నన్ను చిత్రంగా చూస్తుంటే సంతోష పడుతుంటాను.
ఒకసారి నాకు అనారోగ్యం చేసింది.
అరాత్రంత నిద్ర పోయి తెల్లవారి బయటకు వచ్చాను.
విచిత్రం. నన్నెవ్వరు పట్టించుకోవడం లేదు.
నాతో రోజు రాత్రి తిరిగే మిత్రుని అడిగాను.
ఇలా ఎందుకు జరుగుతోందని.అతడు చెప్పాడు .
రాత్రే నాకు విలువని, పగలు నన్నెవ్వరు చూడరని.
నేనొక మిణుగురు పురుగునని .
నా విలువ చీకటి రాత్రుల నందేనని.

3, డిసెంబర్ 2010, శుక్రవారం

బాల్య స్రవంతి

బాల్యం ఎంత మధురం
తిరిగి రాని మరువలేని
మధుర జ్ఞాపకం బాల్యం
కులాని కందక మతాన్ని చూడక
మనసు పాడుకునే
మదుర గీతం బాల్యం
ఉన్నవాళ్ళు లేనివాళ్ళనే బేధంలేని
మనసు ఆడుకునే
మధుర క్రీడ బాల్యం
తనవారు పరవారు
నాది నీది లేకుండా
నిర్మలమైన
మధుర కావ్యం బాల్యం

22, నవంబర్ 2010, సోమవారం

వెంకటేశ్వర స్రవంతి

శ్రీ వారి నగల గురించి తెలుసుకుందాం. బంగారు పాదకవచాలు,
కాలి అందెల గజ్జెలు,పట్టు పీతాంబర కుచ్చేళ్ళపై జిరాడే
సహస్ర మాలలు, బొడ్డు వద్ద సూర్యకఠారి అనే నందక ఖడ్గం,
ఒడ్డాణం, బంగారు మొలత్రాడు, తనపాదాలే పరమార్దమని
తెలిపే వజ్ర ఖచిత వరద హస్తం (కుడివైపు ), తనను శరణు
కోరితే సంసార సముద్రాన్ని మోకాటి లోతుననే ఉంచుతానని
తెలిపే కటి హస్తం (ఎడమవైపు),ఎదపై కౌస్తుభమణి,నవరత్న
హారాలు, బంగారు యజ్ఞోపవితం,శ్రీదేవి భూదేవి మాలలు,
నాగా భరణాలు, భుజ కీర్తులు,భుజములనుండి
సాలగ్రామ మాలలు, శంఖు చక్రములు,కర్ణాభరణాలు,
శిరస్సుపై
నవరత్నఖచిత వజ్ర కిరీటం,బంగారు మకర
తోరణం . ఇవి మూల మూర్తికి ఉండే నగలు.ఇవికాక
ఉత్సవమూర్తులకు అనేకమైన నగలు ఉన్నాయి.
వాటి వివరాలు చెప్పుకొనుట మన బోటివారికిసాద్యం కాదు.

21, నవంబర్ 2010, ఆదివారం

వెంకటేశ్వర స్రవంతి









తిరుమలలోనిస్వామివారికిప్రతిరోజూనైవీద్యాలుపెడుతూఉంటారు.
మనకు
సాధారణంగాతెలిసేప్రసాదాలులడ్డు,పులిహోర,పొంగలి,
వడ
,
అట్లు ,కదంబం .ఇవికాకఎన్నోరకములప్రసాదములు
స్వామివారికి
నైవేద్యం పెడతారు.ఇవి అన్ని శ్రీ వారి ప్రధానవంటశాల
పోటులో
తయారు చేస్తారు .స్వామివారికి పెట్టె నైవేద్యాలనుగురించి
తెలుసుకుందాంవెన్న,పాలు ,చక్కెర, బెల్లం కలిపినా నువ్వుల
పిండి ,చక్కెర పొంగలి ,అప్పాలు ,శుద్దనంసిరా ,
పాయసం ,
కేసరి
బాత్, క్షిరాన్నం,పంచకజ్జాయం(చక్కెర,గసగసాలు,కలకండ,
ఎండు
ద్రాక్ష,జీడిపప్పు, బాదంపలుకులు,ఎండు కొబ్బరి తురుము
మొ!! కలిపినా పొడిప్రసాదం ),నెయ్యి దోసెలు,మోల్హర, పండ్ల
ముక్కలు
, జిలేబి, పెద్దపెద్దమురుకులు, పూర్ణ బూరెలు,
శనగ గుగ్గిళ్ళు, బెల్లపు దోసెలు, శాకరిబాత్, పెసరపప్పు
పరవాన్నం
, బకల బాత్,పానకం, మనోహరం మొ !!
నైవేద్యాలు పెడతారు .వకుళ మాత వీటి తయారిని
పర్యవేక్షిస్తుంటారుట
.
,