3, సెప్టెంబర్ 2012, సోమవారం

గోమాత ప్రాశస్త్యము

 
గోమాత  ప్రాశస్త్యము 
"సర్వతీర్ద మయీం దేవి వేదదేవాత్మికాం శివం 
సురబిం యజ్ఞా స్య జననీ మాతరం త్వానమామ్యాహం "

సర్వ తీర్ధములు నీలోనే కలిగిన ఓ గోమాత !వేదములన్నియు నీలోనే 
ఉన్నాయి .దేవతలందరూ నీలోనే ఉన్నారు.నీవు సర్వ శుభ రూపిణివి.
ఓ!సురభి మాతా!నీవు యజ్ఞమునకు తల్లివంటిదానావు.నీకు నా నమస్కారం
ముప్పదిమూడు కోట్ల దేవతలకు నిలయం గోమాత.గోవులను రక్షించడమంటే 
మనలను మనం రక్షించుకోవడమే. గోవుకోసం మనం వెచ్చించే వ్యయం
 మానసిక శాంతిని సమకూర్చి,పూర్వకృతపాపములను నాశనం చేసుంది.
గోమాత గురించి వేదములందు,వివిధ పురాణములందు చెప్పబడింది.
గోమాత మహత్యమును ఏ పురాణములందు వివరించారో తెల్సుకుందాం.
అధర్వణ వేదంలో 4 వ కాండలో 12 వ సూక్తం గోసూక్తంగా గోమాత యొక్క 
మహత్యం వివరించబడింది.శ్రీ సూక్తం,పురుష సూక్తం,మను సూక్తం లాంటి 
పవిత్ర సూక్తలతోపాటు గోసూక్తం కూడా చెప్పబడింది.గోవు రుద్రులకు తల్లిగా,
వసువులకు పుత్రికగా,ఆదిత్యులకు సోదరిగా, నెయ్యి రూపాన అమృతంగా 
చెప్పబడింది. ఋగ్వేదంలో ఆవును "అఘణ్య" అన్నారు.యజుర్వేదంలో గోవుకు
సాటి ఎవరు లేరని గోవు తర్వాతే అంతా అని చెప్పబడింది. పద్మ పురాణంలో
గోవు మానవ ఆద్యాత్మిక,బౌతిక ఉన్నతిని,సర్వ తీర్ధ ఫలదాయాన్ని ఇస్తుందని 
నాలుగు వేదాలు గోమాటలో ఉన్నాయని చెప్పింది. బ్రహ్మ పురాణంలో సమస్త 
గోవులు విష్ణు స్వరూపమని చెప్పబడింది. కాశిఖండంలో గోమాత త్రిమూర్తులకు 
ప్రీతి పాత్ర మైనదని దేవతలకు ఋషులకు బ్రహ్మదేవుడు వివరించాడు. బ్రాహ్మణులు 
గోవులు ఒక్కటేనని కాలక్రమేణా అవి రెండుగా విడిపొయాయని బ్రాహ్మణులలో 
మంత్రము,గోవులలో యజ్నహవిస్సు ఉంటాయని చెప్పారు. స్కంద పురాణంలో
 "గవో మేచాగ్రతో నిత్యం!గావః వృషత ఏ వచ!
గావోమే హృదయేచైనా ! గవాం మధ్యే వసామ్యాహం!!"    
 భావం: గోమాత ఎప్పుడు నా హృదయమందు,నాముందు ,నావెనుక ఉండుగాక.
నేనెప్పుడుగోవులమధ్యఉండుగాక.అనిఉంది.గోవులపాదములయందుపితృదేవతలు, 
పిక్కలయందుగుడిగంటలు,అడుగులయందుఆకాశగంగ,ముక్కోలుకులయందు
ముత్యపు  చిప్పలు,పొదుగుయందు పుండరికాక్షుడు,స్తనములయందు
 చతుర్వేదములు,గోమయంలో శ్రీ లక్ష్మి పాలలో పంచామృతాలు,తోకలో 
 తొంబదికోట్ల ఋషులు కడుపులో కైలాసం బొడ్డుయండుపొన్నపూవు 
 ముఖమునందు జేష్ఠ కొమ్ములయందు కోటి గుడులు ముక్కున సిరి 
 కళ్ళు కలువరేకులు వెన్నుయండు యమ ధర్మరాజు చెవులలో 
 శంకనాదములు నాలుక యందు నారాయణ స్వరూపం దంతముల 
 యందు దేవతలు పండ్ల యందు పరమేశ్వరి నోటియండు లోక నిధి 
 ఉంటాయి అసలు గోవు అంతా సర్వదేవతా స్వరూపం . తులసి దాస్ 
 ఇలా అన్నారు " ధర్మ, అర్ధ ,కామ,మోక్షములు అను నాలుగు రొమ్ములు 
 కలిగినది గోవు "చరక సంహితంలో " ఆవు పాలు మంచి మందు అని  
ముసలి తనమును , వ్యాధులను అరికట్టేదిగా ఉండదని, ఆవు నెయ్యి 
 బుద్ధిని,జ్ఞాపకశక్తిని ,ఒజస్సుని పెంచుతుందని "ఉండి . గాంధిజీ "
 ఆవు వల్లనే మన జాతి మనధర్మం నిలుస్తుందని , స్వరాజ్య సముపార్జన
  కంటే గొప్పదని, గోసంరక్షణ కొరకు ప్రాణాలు ఇవ్వని వారు అసలు హిందువే 
 కాదన్నారు. గోస్వామి "ఒక గోవు తన జీవిత కాలంలో సగటున 25 వేల 
 మందికి ఆకలి తీరుస్తుందని చెబుతూ గోవును వధిస్తే రాజ్యం లో 
 అరాజకం పెరిగి ప్రజలు నశిస్తారని చెప్పాడు. మహమ్మద్ ప్రవక్త , 
హకిల్ హజ్ మద ఖాన్, హజరత్ మహమూద్ మొదలగు  
మహమ్మదీయ ప్రముఖులు ఆవు పాలు మంచి మందని నెయ్యి
  అమృతంతో సమానమని ఆవు మాంసం రోగ కారకమని ,గోవధ 
 ఖురాన్ లో ఎక్కడ వ్రాసిలేదని గోహత్య ఇస్లాం మతనియమాలకు 
 విరుద్ధమని అన్నారు .అన్ని బాధలు తీర్చి సర్వ దేవతలను తృప్తి 
 పరిచేది,నక్షేత్ర, జాతక దోషాల విముక్తి కొరకు శాంతికి గోసేవ అమృత 
 తుల్యమని అన్నారు ధర్మ, అర్ధ ,కామ,మోక్షములు గోసేవే మంచి 
 సాధనం .గోమాత కీర్తనం శ్రవణం దానం ,ధర్మం ,గోరక్షణం ,గోరక్షణ 
 ప్రోత్సాహం గోరక్షణ ప్రోత్సాహం ప్రేరణం పుణ్య ప్రదమైనవి గోపూజ  
పాపహరమైనది

(సెప్టంబర్ 2012 భక్తీ సుధ మాసపత్రికలో ప్రచురించ బడినది )
          

2 కామెంట్‌లు:

  1. పద్మావతి గారు!
    గోమాత ప్రాశస్త్యము గురించి చక్కగా వివరించారు.
    మంచి విషయాలు తెలియజేసినందుకు కృతజ్ఞతలు.

    రిప్లయితొలగించండి
  2. భారతి గారు కృతజ్ఞతలు .మీ బ్లాగ్ చూశాను చాలా బాగుంది

    రిప్లయితొలగించండి